విశాఖలో కూరగాయల్ని రోడ్డుపై పారేసిన రైతులు

లాక్ డైన్‌తో ప్రజా జీవనం స్తంభించిపోయింది. గత నెలన్నర రోజులుగా ఎక్కడి ప్రజలు అక్కడే ఉండిపోయారు. ఇళ్ల నుంచి బయటకు రాకూడదంటూ నిషేదాజ్ఞలు ఉండటంతో ప్రజలు ఎవరూ అత్యవసరం అయితే తప్పా బటయకు రాలేదు. ఇక అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు వ్యవసాయం చేసేకునేందుకు మినహాయింపులు ఇచ్చిన విషయం తెలిసిందే. అయినా కూడా రైతులు నానా అవస్థలు పడుతున్నారు. కష్టించి పండించిన పంటను మార్కెట్‌కు తీసుకు వచ్చేందుకు ఇబ్బందులు పడుతున్నారు. లాక్ డౌన్‌తో రైతుల పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యింది. పండిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ఇవాళ విశాఖలోని దేవరాపల్లి కూరగాయల మార్కెట్‌లో రైతులు తెచ్చిన పంటను రోడ్డుపైనే పారబోశారు. వంకాయలు, బెండకాయలు అమ్మేందుకు మార్కెట్‌కు తీసుకువచ్చారు. అయితే వాటికి సరైన ధర లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు కూరగాయలను రోడ్డుపై పారోబోసి నిరాశగా వెనుదిరిగాపోయారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు కూడా మద్దతు ధర రావడం లేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు.